ఏఐసీసీ అధ్యక్షులుగా గాంధీ కుటుంబమే కొనసాగాలి

ఏఐసీసీ అధ్యక్షులుగా గాంధీ కుటుంబమే కొనసాగాలి

ఏఐసీసీ అధ్యక్షులుగా గాంధీ కుటుంబమే కొనసాగాలని అన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి . కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న నాయకత్వ సంక్షోభంపై సోమ‌వారం ఆయ‌న స్పందించారు. గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా ఎవరు అధ్యక్షులుగా ఉన్న పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. సోనియా, రాహుల్, కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక బలం, భరోసా అని చెప్పారు. ఈ సందర్భంగా గాంధీ కుటుంబంపై ప్రశంసల జల్లు కురిపించారు. మొదటి ప్రధానిగా నెహ్రు మన దేశానికి ఎన్నో పారిశ్రామిక,ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చారని.. వ్యవసాయ అభివృద్ధి కోసం భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని అన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరా, రాజీవ్ గాంధీలు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు . అలాంటి కుటుంబంపై విమర్శలు చేయడం తగదని సీనియర్లపై మండిపడ్డారు జగ్గారెడ్డి. లేఖ రాసిన వాళ్లు ప్రజనాయకులు కాకపోయినా పార్టీ పదవులు ఇచ్చిందని, పార్టీని చీల్చడానికి ప్రయత్నిస్తున్న సీనియర్లపై చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి కోరారు.

MLA Jaggareddy said the Gandhi family should continue as AICC president