ఆ డమ్మీ మంత్రి చేసేది ఉత్త రిబ్బన్ కటింగ్ లే

ఆ డమ్మీ మంత్రి చేసేది ఉత్త రిబ్బన్ కటింగ్ లే

నల్గొండ జిల్లాలో ఓ డమ్మీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్నారని..ఆయన రిబ్బన కటింగులకు తప్ప రూపాయి తీసుకరారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.  మునుగోడు నియోజకవర్గంలో నిరుద్యోగ దీక్ష చేస్తున్న షర్మిలకు ఫోన్ లో సంఘీభావం తెలిపారు రాజగోపాల్ రెడ్డి. తన నియోజకవర్గంలో మంచి కార్యక్రమం చేపట్టినందుకు సంతోషం వ్యక్తం చేశారు. తాము వైఎస్ఆర్ అభిమానులమని చెప్పారు. తమ ప్రాంతంలో 750 కోట్ల ప్రాజెక్ట్ అయిన ఉదయసముద్రం 2014 నాటికే 90శాతం పూర్తయిందన్నారు. కానీ వైఎస్, కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఎక్కడ పేరు వస్తుందోనని... మిగతా 10శాతం పనులు కేసీఆర్ చేయట్లేదన్నారు. జిల్లాలో ఓ డమ్మీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్నారని చెప్పారు. ఉత్త రిబ్బన కటింగులకు తప్ప.. రూపాయి తీసుకురారని విమర్శించారు.  హుజురాబాద్ లో అమలు చేయబోతున్న దళితబంధు తమ నియోజకవర్గంలోనూ పెట్టాలని రేపు మునుగొడులో పదివేల మందితో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు రాజగోపాల్ రెడ్డి. దీంతో.. ఆ కార్యక్రమానికి తన మద్దతు కూడా ఉంటుందన్నారు షర్మిల.