ఎమ్మెల్యే పల్లాకు హైకోర్టులో ఊరట

ఎమ్మెల్యే పల్లాకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. అనురాగ్, నీలిమ విద్యాసంస్థలను కూల్చొదద్దని హైకోర్టులో వేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు.. శు క్ర వారం (ఆగస్టు 30) వరకు అనురాగ్, నీలిమ విద్యాసంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. చెరువుల రికార్డులు సమర్పించాలని అధికారులను కోరింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు. 

హైదరాబాద్ నగరంలో చెరువులను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.. ఇటీవల సినీ నటుడు నాగార్జున  ఎన్ కన్వెన్షన్ తోపాటు పలువురి అక్రమ కట్టడాలను కూల్చివేసింది.. హైడ్రా ఏర్పాటు చేసినప్పటినుంచి దాదాపు 45 ఎకరాల విస్తీర్ణంలో చెరువుల భూములను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేసి.. భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. 

ALSO READ | హైకోర్టును ఆశ్రయించిన BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

అంతటితో ఆగకుండా హైడ్రా మరింత దూకుడు పెంచింది.. నగరంలో ఆక్రమణకు గురైన పలు చెరువుల్లో నిర్మాణాల కూల్చివేతలకు సిద్దమయింది.. అందులో భాగంగా మాజీ మంత్రి మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కి చెందిన విద్యా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. దీంతో హైకోర్టు ఆశ్రయించారు పల్లారాజేశ్వర్  రెడ్డి. బుధవారం పల్లా పిటిషన్ ను విచారించిన హైకోర్టు ధర్మాసనం.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.