రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే

రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే
  • దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

షాద్ నగర్, వెలుగు: తెలంగాణలో రాబోయేది ముమ్మాటికీ బీజేపీ ప్రభుత్వమేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు. షాద్ నగర్ నియోజకవర్గ నాయకుడు శ్రీవర్ధన్ రెడ్డి నేతృత్వంలో సోమవారం పట్టణానికి చెందిన పలువురు నేతలు రఘునందన్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని మండిపడ్డారు.

ఎంతో మంది అమరుల ప్రాణత్యాగాలతో తెచ్చుకున్న రాష్ట్రంలో ఒక్కవర్గానికి కూడా న్యాయం జరగలేదని, యువతకు ఉద్యోగాలు రాలేదని,  ఉపాధి అవకాశాలు దక్కడం లేదని వాపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని.. మోడీ పాలనను కోరుకుంటున్నారన్నారు. యువత బీజేపీలో చేరి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్, మల్ చలం మురళి, శ్రీనివాస్ చారి, దొడల వెంకటేశ్, బావండ్ల మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.