కరోనా పేషెంట్లకు సేవ చేస్తానంటూ కేసీఆర్ కు రాజాసింగ్ లెటర్

కరోనా పేషెంట్లకు సేవ చేస్తానంటూ కేసీఆర్ కు రాజాసింగ్ లెటర్

హైదరాబాద్: గాంధీ హాస్పిటల్ లో కరోనా సోకిన రోగులకు సేవ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. గాంధీలో రోజుకు 10 నుంచి 12 గంటలు రోగులకు సేవ చేయగలనని లేఖలో తెలిపారు రాజసింగ్. ధూల్ పేటకు చెందిన ఓ ప్రెగ్నెన్సీ చనిపోవడంతో.. గాంధీ హాస్పిటల్ డాక్టర్లు సరిగ్గా పనిచేయడం లేదన్నారు. ధూల్ పేట మహిళకు సరైన వైద్యం అందించాలని అప్పట్లో కేటీఆర్, ఈటలకు, హాస్పిటల్ సూపరింటెండెంట్ కు ఫోన్ ద్వారా రిక్వెస్ట్ చేసినా స్పందించలేదన్నారు. ఈలోగా తల్లితోపాటు కడుపులో ఉన్న శిశువు కూడా చనిపోవడం దారుణమని‌ ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజా సింగ్.