టీఆర్ఎస్ కార్యకర్తలు తాలిబాన్లలా రోడ్డెక్కాలె..

టీఆర్ఎస్ కార్యకర్తలు తాలిబాన్లలా రోడ్డెక్కాలె..


వైరా , వెలుగు: టీఆర్ఎస్ కార్యకర్తలు తాలిబన్లలా, నక్సలైట్లలా రోడ్డెక్కాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే రాములు నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కొణిజర్ల మండలం అమ్మపాలెంలో టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల మీటింగ్ లో మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో ఆయన ఈ కామెంట్లు చేశారు. ‘‘టీఆర్‌‌ఎస్‌‌ల ఉండుడే బ్రాండ్. పదవులతో పనిలేదు. ఈల వేస్తే కార్యకర్తలు కర్ర పట్టాల్సిందే. జెండా పట్టాల్సిందే. తాలిబన్ లెక్క, నక్సలైట్ లెక్క రోడ్డెక్కాలె. టీఆర్ఎస్‌‌లో అందరూ ట్రైన్డ్ సోల్జర్సే. ఎప్పుడైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాల్సిందే. కార్యకర్తలందరి చేతిలో వెపన్ ఉన్నట్లే భావించాలి. అలాంటి వెపన్ ఉన్న వ్యక్తులే మన కేసీఆర్, కేటీఆర్, మంత్రి అజయ్” అని నాయక్ కామెంట్ చేశారు.