బడిలో టీచర్లు లేరని ఎమ్మెల్యే ఫైర్

బడిలో టీచర్లు లేరని ఎమ్మెల్యే ఫైర్

జగిత్యాల జిల్లా కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమానికి వెళ్తున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. రామ్ బజార్ లోని ప్రైమరీ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్లో టీచర్లు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయం 10,30 నిమిషాలు కావస్తున్నా టీచర్ స్కూల్ కి రాకపోవడంతో డీఇఓ కు ఫోన్ చేసి నిలదీశారు. ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు నామమాత్రంగా చర్యలు తీసుకోవడం తనిఖీలు చేయకపోవడంతో విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.