ఖమ్మం ఖిల్లాపై కాంగ్రెస్​ జెండా ఎగరేద్దాం : రాందాస్​ నాయక్

ఖమ్మం ఖిల్లాపై కాంగ్రెస్​ జెండా ఎగరేద్దాం : రాందాస్​ నాయక్

జూలూరుపాడు, వెలుగు : రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఖమ్మం ఖిల్లాపై కాంగ్రెస్​ జెండా ఎగరేద్దామని వైరా ఎమ్మెల్యే రాందాస్​నాయక్ అన్నారు. గురువారం  జూలూరుపాడు మండల కేంద్రంలో మిత్రపక్ష పార్టీల కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే పేదలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు మరింత చేరువవుతాయన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్​కు ఓటు వేస్తే  కులమతాలను రెచ్చకొట్టడం తప్ప ఆ పార్టీలు ప్రజలకు చేసేదేమి లేదని చెప్పారు. కాకర్ల  గ్రామంలోని బీఆర్​ఎస్​కు చెందిన సుమారు 150 కుటుంబాల వారు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో  పార్టీ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, మంగీలాల్, మధుసూదన్​రావు, అల్లాడి నరసింహారావు, సుమంత్, రాంబాబు, నరేశ్, చాంద్​ తదితరులు పాల్గొన్నారు.​

ఎమ్మెల్యే సక్షంలో పార్టీలో చేరికలు

జూలూరుపాడు ఎంపీపీ లావుడియా సోని గురువారం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. బోజతండా మాజీ సర్పంచ్​ కిషన్ లాల్, బోజతండాలోని బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన సుమారు 50 కుటుంబాలు కాంగ్రెస్ ​కండువా కప్పుకున్నాయి.