ఖమ్మం అభివృద్ధికి బీజేపీని గెలిపించాలి : కమల్ చంద్ర భంజ్ దేవ్

ఖమ్మం అభివృద్ధికి బీజేపీని గెలిపించాలి : కమల్ చంద్ర భంజ్ దేవ్

కారేపల్లి, వెలుగు : బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్​రావు విజయంతోనే ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందుతుందని కాకతీయ వంశ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ అన్నారు. ఖమ్మం పార్లమెంటు బీజేపీ అభ్యర్థితో కలిసి గురువారం కారేపల్లి లో రోడ్ షో నిర్వహించారు. బస్టాండ్ సెంటర్​లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. విద్యావంతుడైన వినోద్​రావును గెలిపించాలని కోరారు. మోదీని మూడోసారి ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. దేశ భద్రత, అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. అవినీతి రహిత పాలన అందిస్తున్న ఘనత మోదీకే దక్కుతుందన్నారు. వినోద్ రావు మాట్లాడుతూ తనను గెలిపిస్తే ప్రజా సేవకుడిగా పని చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భూక్య శ్యామ్ రాథోడ్, కృష్ణ రాథోడ్ కల్తీ రాంప్రసాద్, ధనసరి శ్రీను, తురక నారాయణ, అజ్మీర వీరన్న, సుజాత,రామ్మూర్తి , రంగారావు, అరుణ, తదితరులు పాల్గొన్నారు.