- ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్, వెలుగు: సనత్నగర్ సెగ్మెంట్లో చేపట్టిన అభివృద్ధి పనులను తొందరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని ఆయన నివాసంలో జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఇతర శాఖలకు చెందిన అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనుల ప్రగతి గురించి తెలుసుకున్నారు.
వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ అధికారులు కో ఆర్డినేషన్తో పనిచేయాలన్నారు. హమాలీ బస్తీ, రామస్వామి కాంపౌండ్, సజన్ లాల్ స్ట్రీట్ తదితర ప్రాంతాల్లో సీవరేజ్, వాటర్ పైప్ లైన్ పనులు పూర్తికాలేదన్నారు. మరికొన్ని చోట్ల ఈ పనులు పూర్తికాకపోవడం వలన రోడ్ల నిర్మాణం నిలిచిపోయిందన్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లు, పుట్పాత్ల నిర్మాణ పనులను కూడా పూర్తిచేసి జనం అసౌకర్యానికి గురికాకుండా చూడాలన్నారు.