
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ చేయడం చాలా సంతోషకరమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్ పల్లి గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, గద్దర్ కూతురు వెన్నెల హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. అంబేద్కర్ స్ఫూర్తిదాత,మేధావి అని అన్నారు. దళిత సమజానికి ఆదర్శంగా అందరూ మంచి పేరు సంపాదించుకోవాలన్నారు.
రిజర్వేషన్ల కోటాలో దళితులకు న్యాయం చేయాలన్నారు వివేక్ వెంకటస్వామి. తన తండ్రి కాకా వెంకటస్వామి మంచి అవకాశం కల్పించారని చెప్పారు. తాను ఇప్పటికే చాలా విగ్రహాలకు సహాయం చేశానని చెప్పారు. అంబేద్కర్ విగ్రహం చూసినప్పుడు దలితులకు ధైర్యం వస్తుందన్నారు. తన తరపున మరిన్ని అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు కోసం సహాయం చేస్తానని చెప్పారు వివేక్. దళితులందరు కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు.