బీఆర్ఎస్ లీడర్లకు దూరంగా కవిత .. పెద్దపల్లిలో పార్టీ క్యాడర్ వైపు కన్నెత్తి చూడని ఎమ్మెల్సీ

బీఆర్ఎస్ లీడర్లకు దూరంగా కవిత .. పెద్దపల్లిలో పార్టీ క్యాడర్ వైపు కన్నెత్తి చూడని ఎమ్మెల్సీ

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి బీఆర్ఎస్ లీడర్లకు ఎమ్మెల్సీ కవిత ఝలక్ ఇచ్చారు. ఆమె శుక్రవారం మంచిర్యాలకు వెళ్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొద్దిసేపు ఆగి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. కవిత వస్తున్నారనే సమాచారంతో దాదాపు 100 మందికి పైగా బీఆర్ఎస్ ​నేతలు, కార్యకర్తలు తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకున్నారు. కొంతసేపటి తర్వాత బీసీ ఆజాదీ ఫెడరేషన్ (బీసీఏఎఫ్) నాయకులు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో ఓవైపు బీఆర్ఎస్ లీడర్లు, మరోవైపు బీసీఏఎఫ్ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయారు. కవిత తెలంగాణ తల్లి చౌరస్తాకు చేరుకోగానే బీసీఏఎఫ్ నాయకులు ఆమెకు పూలదండలు వేసి ఆహ్వానించారు. వాళ్లకు నమస్తే పెడ్తూ పేరుపేరునా పలకరించిన కవిత.. పక్కనే ఉన్న బీఆర్ఎస్​లీడర్లను మాత్రం పట్టించుకోలేదు. 

బీసీఏఎఫ్​ నాయకులతో కలిసి పైకిఎక్కి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. దీంతో బీఆర్ఎస్​ లీడర్లు ఒక్కసారిగా షాక్‌‌‌‌‌‌‌‌కు గురయ్యారు. బీఆర్ఎస్​ నేతల్లో మాజీ కౌన్సిలర్లు, సీనియర్​ లీడర్లు ఉన్నా కూడా కవిత పలకరించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కనీసం కిందకు దిగిన తర్వాత అయినా కవిత మాట్లా డుతుందని బీఆర్ఎస్ క్యాడర్ ఆశించినా నిరాశే మిగిలింది. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి కిందికి దిగిన కవిత.. బీఆర్ఎస్​ లీడర్లను పట్టించుకోకుండా, మీడియాతో మాట్లాడకుండా కారెక్కి వెళ్లిపోయారు.