ఉద్యమ కారులపై రాళ్లు వేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవా ?

ఉద్యమ కారులపై రాళ్లు వేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవా ?
  • మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ

కరీంనగర్: కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా ఎంపిక చేయడం పట్ల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బొడిగె శోభ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కారులపై రాళ్ల దాడి చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవా..? మానుకోట యుద్ధంలో మేము అందరం కౌశిక్ రెడ్డి చేతుల్లో రాళ్ళ దెబ్బలు తిన్న వాళ్లమని తెలిపారు. ఒకరోజు ముందు పార్టీ కండువా కప్పి రాత్రికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు కేసీఆర్ అని అన్నారు. శ్రీకాంత చారి తల్లి ఎమ్మెల్యే గా ఓడిపోతే ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు..?... 1200 మంది ఉద్యమకారుల ఆత్మలు ఘోషిస్తున్నాయని బొడిగె శోభ పేర్కొన్నారు. లంగలకు, దొంగలకు కేబినెట్ లో చోటు ఇచ్చిండని.. విమర్శించారు. కేసీఆర్ ఎన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చుకున్నా.. హుజురాబాద్ లో గెలిచేది ఈటల రాజేందరేనని గుర్తుంచుకోవాలని ఆమె స్పష్టం చేశారు.