చెత్త తగలబెడితే జరిమానా... రోడ్లపై చెత్త వేసినా చర్యలు తప్పవు: ఎంఎంసీ కమిషనర్ వినయ్కృష్ణారెడ్డి

చెత్త తగలబెడితే జరిమానా... రోడ్లపై చెత్త వేసినా చర్యలు తప్పవు: ఎంఎంసీ కమిషనర్ వినయ్కృష్ణారెడ్డి

హైదరాబాద్ సిటీ, వెలుగు: రోడ్లపై చెత్త వేయడంతోపాటు చెత్త తగలబెడితే జరిమానాలు వేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి హెచ్చరించారు. బుధవారం జవహర్​నగర్, అంబేద్కర్​నగర్, దమ్మాయిగూడ ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. జవహర్​నగర్​లో రోడ్ల పక్కన చెత్తను తగలబెడుతుండగా చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి జరిమానాలు విధించాలని ఆదేశించారు. 

జవహర్‌‌‌‌‌‌‌‌నగర్ – మల్కారం రోడ్డును పరిశీలించిన కమిషనర్.. రోడ్ల పక్కన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను పడేస్తుండడాన్ని  గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  జవహర్​నగర్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఎదురుగా ఉన్న డంపింగ్ సైట్​ను  పరిశీలించారు. హైదరాబాద్ సాలిడ్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జవహర్​నగర్, దమ్మాయిగూడ ప్రాంతాల్లో  రామ్​కీ సీఎస్ఆర్ నిధులతో రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టాలని కమిషనర్ ప్రతిపాదించారు. 

కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సదుపాయాల మెరుగుదలకు రామ్​కీ, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, డీసీ వసంత, డీఈ, ఏఈలు, రామ్‌‌‌‌‌‌‌‌కీ అధికారులు పాల్గొన్నారు.