
మొబైల్ వ్యాలెట్లు వాడుతున్నవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్. కేవైసీ గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆర్బీఐ. ఆగస్టు 31 తో ఈ గడువు ముగిసింది. లేటెస్ట్ గా ఈ గడువును 2020 ఫిబ్రవరి 29 వరకు పొడిగించింది. మళ్లీ గడువును పొడిగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఫిబ్రవరి లోగా పేటీఎం,పోన్ పే,గూగుల్ పే వంటి వ్యాలెట్లకు కేవైసీ అప్ డేట్ చేయించుకోవాలని సూచించింది. లేకపోతే వ్యాలెట్లు పనిచేయబోవని చెప్పింది.