మోండా మార్కెట్ కార్పొరేటర్ విజయోత్సవ ర్యాలీ

మోండా మార్కెట్ కార్పొరేటర్ విజయోత్సవ ర్యాలీ

సికింద్రాబాద్: అత్యధిక మెజార్టీతో తనను గెలిపించినందుకు మోండా డివిజన్ ప్రజలు, బీజేపీ నేతలు, కార్యకర్తలకు కార్పొరేటర్ కొంతం దీపిక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డితోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొన్నారు. మోండా మార్కెట్ 150వ డివిజన్‌‌లో కొంతం దీపిక గెలుపొందిన సందర్భంగా మార్కెట్‌‌లోని పంచముఖి హనుమాన్ ఆలయం నుంచి విజయోత్సవ ర్యాలీ తీశారు.

ఈ విజయోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామచంద్ర రావు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. బీజేపీ నుంచి నెగ్గిన కార్పొరేటర్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 48 స్థానాలను గెలిపించి, గ్రేటర్‌‌లో బీజేపీని రెండో స్థానంలో, మజ్లిస్‌‌ను మూడో ప్లేస్‌‌కు పంపినందుకు నగర ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు. ఇంకొన్ని సీట్లు గెలిస్తే మేయర్ పీఠం బీజేపీదే అయ్యుండేదన్నారు. రానున్న పట్టభద్రుల సిట్టింగ్ సీట్లతోపాటు ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ సీట్స్‌‌ను కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.