AP ను తాక‌నున్న రుతుప‌వ‌నాలు…

AP ను తాక‌నున్న రుతుప‌వ‌నాలు…

మండే వేసవి నుంచి ఏపీ ప్రజలకు ఉపశమనం కలగనుంది.  జూన్ మొద‌టి వారంలో  రాష్ట్రాన్ని చిరుజల్లులు పలకరించనున్నాయని  రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తెలిపింది.

జూన్ 8 లేదా 9వ తేదీల్లో రాష్ట్రంలోని  రాయ‌ల‌సీమ‌ ప్రాంతానికి రుతుప‌వ‌నాలు తాక‌నున్నాయని తెలిపింది. దీని కార‌ణంగా రాయ‌ల‌సీమ‌లోని ప‌లు జిల్లాల్లో వ‌ర్షాలు కురువ‌నున్నాయి. ఈ రుతుపవనాలు ఏపీ కంటే ముందుగా జూన్ 4 లేదా 5వ తేదీల్లో కేర‌ళ‌ను తాక‌నున్నాయని తెలిపింది.