ENG vs IND 2025: ఆ ఇద్దరూ జట్టులో లేరు..ఇంగ్లాండ్‌పై ఇండియా చిత్తుగా ఓడిపోతుంది: ఇంగ్లీష్ మాజీ స్పిన్నర్

ENG vs IND 2025: ఆ ఇద్దరూ జట్టులో లేరు..ఇంగ్లాండ్‌పై ఇండియా చిత్తుగా ఓడిపోతుంది: ఇంగ్లీష్ మాజీ స్పిన్నర్

జూన్ 20 నుంచి ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య ప్రారంభం కానున్న 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు వారం రోజుల్లో ప్రారంభం కానుంది. 2025-2027 టెస్ట్ సైకిల్ లో భాగంగా ఇరు జట్లకు ఇదే తొలి సిరీస్. ఈ సారి భారత్ పూర్తిగా యంగ్ స్టార్లతోనే బరిలోకి దిగుతుంది. ఇంగ్లాండ్ లాంటి పిచ్ లపై భారత యువ జట్టుకు అతి పెద్ద సవాలుగా మారనుంది. కనీసం ఇంగ్లాండ్ కు పోటీ అయినా ఇస్తారో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో శుభమాన్ గిల్ భారత టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్ గా ఎంపికయ్యాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. 

ఈ మెగా సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 5 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ కనీసం పోటీ కూడా ఇవ్వలేదని జోస్యం చెప్పాడు. పనేసర్ మాట్లాడుతూ.. " విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడకపోవడం ఇంగ్లాండ్ కు కలిసి వస్తుంది. భారత జట్టుకు వీరి అనుభవం మిస్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న జట్టుకు ప్రతిభ ఉన్న అనుభవం లేదు. అనుభవం లేకుండా ఆడితే ఏమవుతుంది..? ఇంగ్లాండ్ ఎలా ఆడుతుందో మాకు తెలుసు. ఈ సిరీస్ లో భారత జట్టు కుప్పకూలే అవకాశం ఉంది". అని పనేసర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 

►ALSO READ | ENG vs IND 2025: గౌతమ్ గంభీర్ తల్లికి గుండెపోటు.. స్వదేశానికి టీమిండియా హెడ్ కోచ్

ఈ సందర్భంగా గిల్ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ అతనికి మద్దతుగా నిలిచాడు. " శుభమాన్ గిల్ మంచి కెప్టెన్ అవుతాడని నేను అనుకుంటున్నాను. అతను బాధ్యతతో బాగా బ్యాటింగ్ చేస్తాడని నేను అనుకుంటున్నాను" అని పనేసర్ అన్నాడు. గిల్ ఇప్పటివరకు 32 టెస్ట్ మ్యాచ్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 35 యావరేజ్ తో 1,893 పరుగులు చేశాడు. 25 ఏళ్ల శుభమాన్ టెస్టుల్లో తొలిసారిగా భారత జట్టుకు కెప్టెన్సీ చేయనున్నాడు. గత రెండు సీజన్ లుగా ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టును విజయవంతంగా నడిపించాడు. 

ఇంగ్లాండ్ టూర్‎కు వెళ్లే భారత టెస్ట్ జట్టు:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్,వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శార్దూల్ సింగ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్


ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ 2025 టెస్ట్ సిరీస్ షెడ్యూల్

1వ టెస్ట్: జూన్ 20-24 - హెడ్డింగ్లీ, లీడ్స్
2వ టెస్టు: జూలై 2-6 - ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
3వ టెస్టు: జూలై 10-14 - లార్డ్స్, లండన్
4వ టెస్టు: జూలై 23-27 - ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
5వ టెస్టు: జూలై 31-ఆగస్టు 4 - కియా ఓవల్, లండన్