ఈ దోమలు చాలా మంచివి!

ఈ దోమలు చాలా మంచివి!

ప్రపంచంలోని చాలాదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య.. ఓ చిన్న దోమ! ఇవి ప్రభుత్వాలనే ఇరుకున పడేస్తు న్నాయి. డెంగీ, మలేరియా వంటి భయంకరమైన జబ్బులకు కారణమవుతున్న చిన్న దోమను కంట్రోల్ చేయలేకపోతున్నారంటూ కోర్టు లు ప్రభుత్వాలకు వార్నింగ్ లు ఇస్తు న్నాయి. అయితే సింగపూర్ లాం టి దేశాలు మాత్రం ఈ సమస్యకు చాలా ఈజీగా పరిష్కారం చూపుతున్నాయి. ఇంతకీ సింగపూర్ ఏం చేస్తుం దో తెలుసా? దోమల్ని పెం చి వీధుల్లో వదులుతోంది!!

అవును.. సింగపూర్‌లో దోమల గుడ్లను సేకరించి, వాటిని ప్రత్యేక నర్సింగ్ హోంలలో పెంచి, పెద్దచేసి, వీధుల్లో వదిలిపెడుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజ్జంగా నిజం. ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలుసా? దోమల సంఖ్యను తగ్గించడానికి!! ఏందీ.. దోమల సంఖ్యను తగ్గించడానికి దోమలు పెంచుతున్నారా? ఇదేంటి? అని డౌట్ పడుతున్నారా? మీరు నమ్మినా, నమ్మకపోయినా దోమల సంఖ్యను తగ్గించేందుకే వాళ్లు ఇదంతా చేస్తున్నారు.

దోమలు కనిపిస్తే వెంటనే చంపేస్తాం. మస్కిటో కాయిల్స్​, గుడ్ నైట్ , ఆలవుట్ వంటి మస్కిటో రిపెల్లెంట్స్​ను దోమలపై ప్రయోగిస్తాం. దోమలు కుట్టకుండా ఒళ్లంతా రకరకాల క్రీములు రాసుకుంటాం. బెడ్ రూమ్‌లో మంచాన్ని పూర్తిగా కవర్ చేసేలా దోమతెరను కట్టుకుంటాం. అబ్బో.. ఇవేనా, ఇంకా ఎన్నో అవస్థలు పడతాం. ఇవన్నీ ఓ చిన్న దోమ నుంచి తప్పించుకునేందుకే. అయితే సింగపూర్ ప్రజలు మాత్రం ఓ ఫ్యాక్టరీ నుంచి దోమలను కొనుక్కొచ్చి సెల్లార్‌లో, డాబాలపై, పార్కుల్లో , బాల్కనీల్లో వదిలిపెడుతున్నారు. అలా ఎందుకు? అని అడిగితే … సేమ్ ఆన్సర్ ‘దోమల సంఖ్యను తగ్గించేందుకే’నని!

ముల్లును.. ముల్లుతోనే తీయాలి. ఇది మనదగ్గరి మాట! దోమను.. దోమతోనే అంతమొందించాలి. ఇది సింగపూర్ మాట. దోమలను దోమలతో ఎలా అంతమొందిస్తారు? అని అడిగితే .. మేం జెనటికల్లీ మోడిఫైడ్ చేసిన దోమలను సృష్టించి, వాటి సాయంతో మిగతా దోమలను అంతమొందిస్తామని చెబుతున్నారు కొంతమంది సింగపూర్‌కు చెందిన నేషనల్ ఎన్విరాన్ మెంట్ ఏజన్సీ సైంటిస్టులు. ‘‘ప్రాజెక్ట్​ వోల్బాచియా’’ పేరుతో దోమలను పూర్తిగా నిర్మూలించే ప్రయోగాన్ని చేపట్టారు. అది సక్సెస్ కావడమే కాదు.. ప్రపంచం మొత్తం ఇప్పుడు వీళ్ల ప్రయోగం గురించే మాట్లాడుకుంటోంది.

ఇంతకీ ఈ సైంటిస్టుల బృందం ఏం చేసిందంటే.. వీధులు, మురికివాడల్లో నుంచి దోమల గుడ్లను సేకరించి, ప్రత్యేక మస్కిటో నర్సింగ్ హోంలలో పెంచుతారు. జెనెటికల్‌గా మోడిఫై చేసి, సృష్టించిన ఈ దోమలను సైంటిస్టులంతా ‘గుడ్ మస్కిటోస్ ’ అని పిలుస్తారు. ఎందుకంటే ఇవి అసలు కుట్టవట. అంతేకాదు.. మిగతా దోమలను చాలా త్వరగా తమ ప్రేమలో పడేసుకుంటాయట. నర్సింగ్ హోంలో పెరిగిన దోమలు కాకుండా బయట తిరిగే దోమలను సైంటిస్టులు ‘బ్యాడ్ మస్కిటోస్’ అని పిలుస్తారు. ఈ బ్యాడ్ మస్కిటోస్ ఉండే ప్రాంతాల్లో గుడ్ మస్కిటోస్‌ను వదిలిపెడతారు. అలా గుడ్ మస్కిటోస్‌తో బ్యాడ్ మస్కిటోస్ కలిసిపోయేలా చేస్తారు. ఇలా ఎందుకంటే.. గుడ్ మస్కిటోస్‌తో కలిసిన బ్యాడ్ మస్కిటోస్ .. తమ పునరుత్పత్తి శక్తిని పూర్తిగా కోల్పోతాయట. ఇలా దోమల్లో పునరుత్పత్తి శక్తి లేకుండా చేయడం ద్వారా వాటి సంఖ్యను తగ్గిస్తారన్నమాట.

ఆస్ట్రేలియా, బ్రెజిల్‌ , కొలంబియా దేశాల్లో ..
వోల్బాచియా అనేది ఓ బ్యాక్టీరి యా. దీనికి డెంగీ లాంటి జబ్బులకు కారణమయ్యే వైరస్‌లను నాశనం చేసే శక్తి ఉంది. అందుకే ఆస్ట్రేలియా, బ్రెజిల్‌‌, కొలంబియా దేశాల్లో కూడా వోల్బాచియా బ్యాక్టీరియాను ప్రవేశపెట్టిన దోమల్ని పెంచుతున్నారు. పునరుత్పత్తి ప్రక్రియలో మిగతా దోమలకూ ఆ బ్యాక్టీరి యాను అంటిస్తుంది. దీంతో కొత్తగా పుట్టే దోమల్లో కూడా వోల్బాచియా బ్యాక్టీరి యా ఉంటుంది. ఇలా కొత్తగా పుట్టే అన్ని దోమల్లో వోల్బాచియా అనే బ్యాక్టీరియా ఉండడం వల్ల అవి డెంగీలాంటి వ్యాధులకు కారణమయ్యే వైరస్‌లను వ్యాపింపజేయలేవు. ఆడదోమల గుడ్లలో వోల్బాచియా బ్యాక్టీరియాను ప్రవేశపెట్టడం ద్వారా కొత్త దోమలను సృష్టిస్తారు. వీటిని పెట్టెల్లో పెట్టి స్కూలు స్టూడెంట్లకు ఇస్తారు. పిల్లలు తమ ఇళ్లకు తీసుకెళ్లి పరిసరాల్లో విడిచిపెడతారు. ఈ దోమలును విడిచిపెట్టిన ప్రతిచోటా మంచి ఫలితాలు కనిపించాయని ఆస్ట్రేలియా సైంటిస్ట్​ స్కౌట్ ఓ నీల్ తెలిపారు. వోల్బాచియా బ్యాక్టీరియాను ఆస్ట్రేలియాలో తొలిసారిగా కనుగొన్నది కూడా ఆయనే. అయితే జబ్బుల్ని వ్యాపింపజేయకపోయినా ఈ దోమలు కుట్టడం మాత్రం కామనే. కానీ సింగపూర్‌లో మోడిఫై చేసిన దోమలకు కనీసం కుట్టే శక్తి కూడా లేదు.

‘‘దోమలను నిర్మూలిం చడానికి ఇదో నేచురల్ పద్ధతి. ఎటువంటి హానికారక రసాయనాలు వాడకుండానే దోమల్లో పునరుత్పత్తి శక్తి తగ్గించడం ద్వారా వాటి సంఖ్యను తగ్గిస్తాం . ఈ పద్ధతి వల్ల మనుషుల ఆరోగ్యానికి, వాతావరణానికి ఎటువంటి ముప్పు ఉండదు. మలేరియా, డెంగీ వంటి జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉండదు. ఇప్పటికే చాలామంది మా దగ్గర నుంచి ‘గుడ్ మస్కి టోస్ ’ తీసుకెళ్తు న్నారు. వీటిని వదిలిపెట్టిన ప్రాంతాల్లో దోమల సంఖ్య 90 శాతం తగ్గింది. ఆయా ప్రాంతాల్లో డెంగీ కేసులు కూడా 90% తగ్గినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ’’ –
– లీ చువాన్ సెంగ్ ,
నేషనల్ ఎన్విరాన్‌మెంట్ ఏజెన్సీ
చైర్మన్ , సింగపూర్