భైంసాలో భరోసా యాత్ర చేస్తా

భైంసాలో భరోసా యాత్ర చేస్తా

సీఎం కేసీఆర్ భైంసాలో పర్యటించి అల్లర్లలో గాయపడిన వారిని పరామర్శించకపోతే తానే భైంసాలో భరోసా యాత్ర చేస్తానని బీజేపీ ఎంపీ బండి సంజయ్ హెచ్చరించారు. భైంసాలో ఎంఐఎం గూండాల దాడిలో గాయపడి.. సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన బుధవారం పరామర్శించారు. ‘భైంసా బాధితుల పరిస్థితి హృదయవిదారకరం. బాధితులకు అందుతున్న చికిత్స గురించి ఆస్పత్రి వర్గాలతో చర్చించాను. ముఖ్యమంత్రి కేసీఆర్ భైంసాలో హింసోన్మాదం సృష్టించిన ఎంఐఎంకు కొమ్ముకాస్తున్నడు. కనీసం ప్రభుత్వం తరఫున ఏ ఒక్కరూ కూడా బాధితులను పరామర్శించకపోవడం సిగ్గుచేటు. ఒక వర్గానికి కొమ్ముకాస్తూ, ఓటుబ్యాంకు రాజకీయం చేస్తూ హిందువులపై దాడులను ప్రోత్సహించడం దుర్మార్గం. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా..? బైంసా ఘటన పక్కా ప్రణాళిక ప్రకారం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బైంసా వెళ్లకపోతే నేనే భైంసాలో భరోసా యాత్ర చేస్తా’ అని ఆయన అన్నారు.

https://twitter.com/bandisanjay_bjp/status/1369548156061458435