గాంధీ కుటుంబంపై బీజేపీ కుట్ర

గాంధీ కుటుంబంపై బీజేపీ కుట్ర

హైదరాబాద్, వెలుగు: దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన నెహ్రూ–గాంధీ కుటుంబాన్ని టార్గెట్​ చేస్తూ కేసుల పేరుతో ఇబ్బంది పెట్టుడేందని ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి ప్రశ్నించారు. ఇది బీజేపీ కుట్రలో భాగమేనని ఆరోపించారు. దీనికి నిరసనగా ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాల్లో కార్యకర్తలు పాల్గొనాలని మంగళవారం పిలుపునిచ్చారు. నేషనల్ హెరాల్డ్​ కేసులో ఈడీ పంపిన సమన్లకు ప్రతిస్పందనగా సోనియా గాంధీ ఈ నెల 21న విచారణకు హాజరవుతారని చెప్పారు. బీజేపీ కుట్రను తిప్పి కొట్టేందుకు కాంగ్రెస్  శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కేసులో మనీ లాండరింగ్​ అబద్ధమని, ఈడీ నిరాధారమైన ఆరోపణలు చేసిందన్నారు. దేశంలో ఎన్నో సమస్యలున్నాయని, వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే మోడీ సర్కార్​ ఈ పని చేస్తోందన్నారు.