- మోస్ట్ పాపులర్ లిస్ట్లో రెండో స్థానంలో మహీ
న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. యుగోవ్ అనే సంస్థ నిర్వహించిన మోస్ట్ పాపులర్ సర్వేలో ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత ఇండియాలో అంతటి పాపులారిటీ ధోనీకే ఉందని స్పష్టమైంది. కెరీర్ చరమాంకంలోఉన్న ఈ జార్ఖండ్ డైనమెట్ ఆటకు రెండు నెలలు దూరంగా ఉన్నా, రిటైర్మెంట్ విషయంలో విమర్శలను ఎదుర్కొంటున్నా.. అంతే స్థాయిలో అభిమానాన్ని దక్కించుకుంటున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా 42వేల మందితో నిర్వహించిన సర్వేలో 8.58 శాతం మంది ధోనీనే ఇష్టపడ్డారు. మోడీ 15.66 శాతం ఓట్లతో టాప్ప్లేస్లో నిలిచారు. ఇండియా స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీలో ధోనీ తర్వాత సచిన్ రెండో స్థానంలో నిలవగా.. విరాట్ కోహ్లీ మూడో స్థానం దక్కించుకున్నాడు. కాగా మహిళల విభాగంలో లెజెండరీ బాక్సర్ మేరీ కోమ్ 10.36 శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలిచింది.