ములాయం సింగ్ యాదవ్ భార్య కన్నుమూత

ములాయం సింగ్ యాదవ్ భార్య కన్నుమూత

సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ భార్య సాధన గుప్తా శనివారం కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆమె మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సాధన గుప్తా మృతి పట్ల ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ట్విట్టర్‌లో తన సంతాపాన్ని ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాడ  సానుభూతిని తెలియజేశారు. సాధన గుప్తా ములాయం సింగ్ యాదవ్ కు  రెండవ భార్య. ఆమె కొడుకు పేరు ప్రతీక్ యాదవ్ కాగా బీజేపీ నాయకురాలైన అపర్ణా యాదవ్ ఆమెకు కోడలు అవుతుంది.