
మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(Multiplex Association of india) సినీ ప్రియులకు శుభవార్త చెప్పింది. అక్టోబర్ 13 జాతీయ సినిమా దినోత్సవం(National cinema day) సందర్భంగా ఆ ఒక్కరోజు దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్లలో కేవలం రూ.99కే టికెట్స్ బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన నగరాలు, థియేటర్లలో మాత్రమే వర్తిస్తుందట. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపింది మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.
ALSO READ: సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన రాజశేఖర్! .. హీరో ఎవరంటే?
National Cinema Day is back on October 13th. Join us at over 4000+ screens across India for an incredible cinematic experience, with movie tickets priced at just Rs. 99. It's the perfect day to enjoy your favorite films with friends and family. #NationalCinemaDay2023 #13October pic.twitter.com/Pe02t9F8rg
— Multiplex Association Of India (@MAofIndia) September 21, 2023
ఈ ఆఫర్ కింద దాదాపు 4 వేల కంటే ఎక్కువ స్క్రీన్లలో కేవలం రూ.99కే సినిమా చూసే అవకాశాన్ని కల్పించింది. ఇప్పటికే రిలీజైన సినిమాలతో పాటు.. శుక్రవారం(అక్టోబర్ 13) రిలీజయ్యే సినిమాలకు కూడా ఈ ఆఫర్ వర్తించనుంది. ఇక ఈ ఆఫర్.. పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, సిటీప్రైడ్, ఏషియన్, ముక్తా ఏ2, మూవీ టైమ్, వేవ్, ఎం2కే, డిలైట్ వంటి ప్రముఖ థియేటర్లలో అందుబాటులో ఉండనుంది. ఇక్కడ మరో వేశాశం ఏంటంటే.. కేవలం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. సో మీరు కూడా కేవలం రూ.99కే అదికూడా మల్టీప్లెక్స్ లో మీకు నచ్చిన సినిమా చూసి ఎంజాయ్ చేయండి.