MI vs PBKS Qualifier 2: క్వాలిఫయర్ 2లో ముంబై భారీ స్కోర్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..?

MI vs PBKS Qualifier 2: క్వాలిఫయర్ 2లో ముంబై భారీ స్కోర్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..?

ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న క్వాలిఫయర్ 2 లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించింది. ఆదివారం (జూన్ 1) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ జానీ బెయిర్ స్టో (38) ఇచ్చిన మెరుపు ఆరంభానికి తోడు తిలక్ వర్మ(44), సూర్య కుమార్ యాదవ్ (44) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. తిలక్ వర్మ (44) టాప్ స్కోరర్ గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో  ఓమర్జాయ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. మార్కస్ స్టోయినిస్, చాహల్, విజయ్ కుమార్ వైశుక్, జెమీసన్ తలో వికెట్ తీసుకున్నారు.    

ALSO READ | MI vs PBKS Qualifier 2: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పంజాబ్.. తుది జట్టులో చాహల్

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబైకి ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 4 పరుగులకే స్టోయినిస్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఈ దశలో తిలక్ వర్మ,బెయిర్ స్టో ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరూ బౌండరీలతో చెలరేగడంతో ముంబై పవర్ ప్లే లో వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత  జోరు మీదున్న బెయిర్ స్టో (38) ని పంజాబ్ పెవిలియన్ కు పంపించింది. తర్వాత ఈ సీజన్ లో సూపర్ ఫామ్ లో ఉన్న సూర్యతో కలిసి తిలక్ 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు. 

220 పరుగులు ఖాయమనుకున్న దశలో పంజాబ్ బౌలర్లు విజృంభించారు. 14 ఓవర్ ఐదో బంతికి చాహల్.. సూర్య (44)ని ఔట్ చేయగా, 15 ఓవర్ తొలి బంతికి తిలక్ వర్మ (44) ను జెమీసన్ పెవిలియన్ కు పంపాడు. మూడు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోవడంతో ముంబై స్కోర్ వేగం తగ్గింది.  ఆరంభంలో కాస్త నిదానంగా ఆడినా చివర్లో నమన్ ధీర్ (18 బంతుల్లో 37) హిట్టింగ్ తో ముంబై 200 పరుగుల మార్క్ అందుకుంది.