MI vs PBKS Qualifier 2: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పంజాబ్.. తుది జట్టులో చాహల్

MI vs PBKS Qualifier 2: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పంజాబ్.. తుది జట్టులో చాహల్

ఐపీఎల్ 2025 లో ఆదివారం (జూన్ 1) ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య క్వాలిఫయర్ 2 ప్రారంభమైంది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు వెళ్తుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్లేయింగ్ 11 లోకి రావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ముంబై ఒక మార్పుతో బరిలోకి దిగింది. గ్లేస్సన్ స్థానంలో టొప్లీ తుది జట్టులో స్థానం సంపాదించాడు. 

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): 

రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీ