సంగీతం తీరాలు దాటుతోంది

 సంగీతం తీరాలు దాటుతోంది

క్లాస్, మాస్ అనే తేడా లేకుండా తనదైన స్టైల్‌‌‌‌‌‌‌‌తో అలరిస్తుంటాడు  మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ దేవిశ్రీ ప్రసాద్. సినిమా సంగీతంలో ఓ ట్రెండ్‌‌‌‌‌‌‌‌ని క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేసిన దేవి.. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రానికి వర్క్ చేశాడు. శర్వానంద్, రష్మిక  నటించిన ఈ మూవీ మార్చి4న రిలీజవుతున్న సందర్భంగా కాసేపు ఇలా కబుర్లు చెప్పాడు.‘‘దర్శకుడు కిశోర్ తిరుమలతో నాకిది నాలుగో సినిమా. తనతో వర్క్ చేయడం ఎంతో  కంఫర్ట్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. చాలా క్రియేటివ్‌‌‌‌‌‌‌‌గా ఆలోచిస్తారాయన. కథ చెప్పేటప్పుడే ఎక్కడ పాట రావాలనేది చెప్పేస్తారు. పైగా ఆయన చిత్రాలన్నీ సాంగ్స్ బేస్డ్ స్టోరీసే. అలాగే ఎమోషన్‌‌‌‌‌‌‌‌తో పాటు ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ కూడా ఉంటుంది. ఈ మూవీ కూడా అంతే. ఇది కిశోర్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే బెస్ట్‌‌‌‌‌‌‌‌ మూవీ అవుతుంది.  కథలో స్పాన్ ఉంది కాబట్టే సంగీతం బాగా కుదిరింది. నాలుగు పాటలతో పాటు సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజింగ్ సాంగ్ కూడా ఉంది.  శర్వా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రష్మికకు ‘పుష్ప’ తర్వాత ఈ సినిమా రావడం ప్లస్. అందులో విలేజ్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తే, ఇందులో మోడర్న్ అమ్మాయిగా నటించింది. ఇక ఖుష్బూ, రాధిక, ఊర్వశి లాంటి సీనియర్ యాక్టర్స్‌‌‌‌‌‌‌‌ మూవీకి హైలైట్. లేడీస్‌‌‌‌‌‌‌‌, పిల్లలు, యూత్‌‌‌‌‌‌‌‌ అందరికీ సినిమా నచ్చుతుంది. ఇప్పటికి నేను మూడుసార్లు చూశాను. ఇందులో శర్వాని చేసినట్టే నా కజిన్స్ అందరూ నన్ను బాగా ముద్దు చేస్తారు. అందుకే ఈ సినిమా నా జీవితంలాగే అనిపించింది. సంగీతానికి ఎప్పుడూ గోల్డెన్ ఎరానే నడుస్తుంది. అందుకే వందేళ్ల క్రితం పాటల్ని కూడా ఇంకా గుర్తుపెట్టుకుంటున్నాం. మన సంగీతం తీరాలు దాటి వెళుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఎఫ్‌‌‌‌‌‌‌‌3,  రంగరంగ వైభవంగా చిత్రాలతో పాటు బాబీ దర్శకత్వంలో చిరంజీవి గారు నటిస్తున్న సినిమా, హరీష్ శంకర్, పవన్  కళ్యాణ్‌‌‌‌‌‌‌‌ల సినిమా కూడా చేస్తున్నాను. ఓ బాలీవుడ్ మూవీకి కూడా వర్క్ చేస్తున్నాను.’’