నంద్యాల కూరగాయల మార్కెట్ తగలబడిపోయింది

నంద్యాల  కూరగాయల మార్కెట్ తగలబడిపోయింది

నంద్యాల పండ్ల మార్కెట్లో  భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో పండ్ల దుకాణాలు పూర్తిగా దగ్ధమైయ్యాయి. పండ్ల దుకాణాలలోని గడ్డి, చెక్కపెట్టెల వల్ల అగ్రికీలలు భారీగా ఎగసిపడ్డాయి. దాంతో స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలార్పారు. అగ్నిప్రమాదం వల్ల దాదాపు రూ. 25 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని దుకాణదారులు వెల్లడించారు. చిరువ్యాపారం చేసి జీవనం కొనసాగించే వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అగ్నిప్రమాదం వలన జీవనోపాధి కోల్పోయిన వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.