తెలంగాణ వ‌చ్చినంక కూడా అన్యాయ‌మే

తెలంగాణ వ‌చ్చినంక కూడా అన్యాయ‌మే

పోతిరెడ్డి పాడు విస్తరణతో దక్షిణ తెలంగాణకు భారీగా నష్టం జరుగుతుందన్నారు మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. కేసీఆర్, జగన్ లు సమావేశం అయ్యాక కూడా జగన్ సంగమేశ్వర్ ప్రాజెక్టుకు జీఓ ఇచ్చి, 170 టీఎంసీల నీరు ఏపీకి త‌ర‌లించార‌న్నారు. నెల్లూరులో రెండు పంటలు పండించుకున్నారని.. మూడో పంటకు సిద్ధం అవుతున్నారని తెలిపారు. కృష్ణ నుంచి పెన్నా బేసినకు తరలిస్తున్నారని.. మనకు 69 శాతం కృష్ణాలో హక్కు ఉందన్నారు నాగం జనార్దన్ రెడ్డి.

12 వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ తెచ్చుకుంటే.. కేసీఆర్ జగన్ తో చీకటి ఒప్పందాలు చేసుకొని మోసం చేస్తున్నారని మండిప‌డ్డారు. కేసీఆర్ కు పంపులు, మోటార్లు,  ఇంజనీర్, డిజైన్ తప్ప ఏమీ తెలియదని.. కృష్ణ నీళ్లు దోచుకుపోతే గోదావరి నీటిని ఎత్తిపోసి కమిషన్లు దోచుకోవలని చూస్తున్నారు. కృష్ణాలో నికర జలాలు కూడా తెలంగాణ వాడుకోలేదని.. కృష్ణానది కమిటీ అన్ని గ్రామాలు తిరుగుతుందని.. కేసీఆర్ లోపాయకారి ఒప్పందాలను బయటపెట్టి రైతుల పక్షాన పోరాడుతామన్నారు నాగం జనార్దన్ రెడ్డి.