షాకిచ్చిన నాంపల్లి కోర్టు.. హీరో వెంకటేష్, రానా లపై కేసు నమోదు..

షాకిచ్చిన నాంపల్లి కోర్టు.. హీరో వెంకటేష్, రానా లపై కేసు నమోదు..

టాలీవుడ్ నటుడు వెంకటేష్, యంగ్ హీర్ రానాకు నాంపల్లి కోర్టులో గట్టి షాక్ తగిలింది. ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచన్ కూల్చివేతే కేసులో నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. టాలీవుడ్ నటుడు దగ్గుబాటి వెంకటేశ్, ప్రొడ్యూసర్ సురేష్ బాబు, దగ్గుబాటి రానా పై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.   

 కోర్టు ఆదేశాలను దిక్కరించి కూల్చివేతలకు పాల్పడ్డారని నంద కుమార్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కోట్ల విలువైన బిల్డింగ్ ద్వసం చేసి.. ఫర్నీచర్ ఎత్తుకెళ్లారని కోర్టుకు పిటీషన్ లో తెలిపారు. విచారణ జరిపిన కోర్టు ముగ్గురి పై ఐపీసీ సెక్షన్ 448, 452,380, 506,120b కింద కేసు నమోదు చేయాలని తెలిపింది.