బిగ్ బాస్​షోతో సమాజం చెడిపోతున్నది : నారాయణ

బిగ్ బాస్​షోతో సమాజం చెడిపోతున్నది :  నారాయణ

ముషీరాబాద్, వెలుగు: బిగ్ బాస్ వంటి నేరపూరిత షోల వల్ల సమాజం చెడిపోతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు జరుగనున్న ప్రజానాట్య మండలి జాతను ట్యాంక్ బండ్ మగ్దూం మొహియుద్దీన్ విగ్రహం వద్ద శనివారం నారాయణ  ప్రారంభించి మాట్లాడారు. దేశంలోని కళా రంగాన్ని ప్రధాని మోదీ నాశనం చేస్తున్నారని విమర్శించారు.

కళ అనేది కళ కోసం కాదు.. కళ అనేది ప్రజల కోసం అనే నినాదంతో తెలంగాణ ప్రజా నాట్యమండలి పనిచేస్తుందని తెలిపారు. ప్రజా నాట్యమండలి జాతను ప్రజలందరూ స్వాగతించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విఎస్. బోస్, ఛాయాదేవి, తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె. శ్రీనివాస్, పల్లె నరసింహ తదితరులు పాల్గొన్నారు.