సాఫ్ట్​వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం

సాఫ్ట్​వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం
  • కాలిపోయిన కంప్యూటర్లు
  • హిమాయత్​నగర్​లో ఘటన

బషీర్​బాగ్, వెలుగు: సాఫ్ట్​వేర్ కంపెనీలో మంటలు చెలరేగిన ఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలుగు అకాడమీకి ఎదురుగా తిరుమల ఎస్టేట్ పేరుతో ఐదంతస్తుల బిల్డింగ్ ఉంది. రెండో అంతస్తులో ఉన్న క్సైడిస్ సాఫ్ట్​వేర్ కంపెనీ సర్వర్ రూమ్​లో గురువారం ఉదయం షార్ట్ సర్క్యూట్​కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో  ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. మంటల్లో కంప్యూటర్లు కాలిపోయాయి. ఐదంతస్తుల బిల్డింగ్ మొత్తాన్ని పొగ చుట్టేసింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆఫీసులో సుమారు 100 మంది ఉద్యోగులున్నారని.. వారంతా సేఫ్​గా బయటికి వచ్చినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు.  వందలాది కంప్యూటర్లు కాలిపోయాయని.. ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నామన్నారు.