సన్ సిటీ అడ్డాగా డ్రగ్స్ దందా.. నైజీరియన్స్ ఇండ్లలో సోదాలు

సన్ సిటీ అడ్డాగా డ్రగ్స్ దందా.. నైజీరియన్స్ ఇండ్లలో సోదాలు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సన్ సిటీ, హైదర్ షాకోట్ ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. డ్రగ్స్ దందాపై దృష్టి పెట్టిన పోలీసులు.. నైజీరియన్స్ ఉంటున్న ఇండ్లలో సోదాలు  చేశారు.  వాళ్ళ పాస్ పోర్టులు, విసాలను పరిశీలించారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా రాష్ట్రంలో ఉంటున్నట్టు గుర్తించారు పోలీసులు. 

సన్ సిటీని అడ్డాగా చేసుకొని  చాలా సార్లు డ్రగ్స్ తో పట్టుబడ్డారు నైజీరియన్స్. దీంతో  నైజీరియన్లు ఉంటున్న ఏరియాల్లో ప్రతీ ఇంట్లో  తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఉదయం 5 గంటల నుంచి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.