
యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి(Naveen polishetty), స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka shetty) జంటగా వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి( Miss shetty Mr Polishetty). లేటెస్ట్ గా ఈ మూవీ మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది.
సెప్టెంబర్ 7న రిలీజ్ అయినా ఈ మూవీ ఆడియన్స్ ను వీపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే చాలా థియేటర్స్లో హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. నవీన్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్కు ఆడియన్స్ ఫిదా అవుతున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ తెలుపుతున్నారు.
ఇక ఈ మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే..యూఎస్ లో వన్ మిలియన్ మార్క్ కలెక్షన్స్ సాధించింది. నవీన్ పొలిశెట్టి లాస్ట్ ఫిలిం జాతి రత్నాలు వన్ మిలియన్ మార్క్ చేరిన విషయం తెలిసిందే. దీంతో నవీన్ కెరీర్లోనే వన్ మిలియన్ మార్క్ సాధించిన రెండో సినిమాగా..మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి నిలిచింది. ఇక మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 4 రోజుల కలెక్షన్స్ పర్లేదు అనేలా ఉన్నాయి.
వరల్డ్ వైడ్ గా రూ.12.60 కోట్ల షేర్, రూ.26 కోట్లు గ్రాస్ సాధించినట్టు సమాచారం. ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ రూ.12.50 కోట్లు కాగా, బ్రేక్ ఈవెన్ రూ.13.50 కోట్లు మారింది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 0.30 కోట్లు రావాలని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మూవీలో ఫన్ , ఎమోషన్స్ ఎక్కువ ఉండటంతో.. రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది.
ఫన్ కామెడీ నేపథ్యంతో వచ్చిన ఈ మూవీ..మేకర్స్ ఊహించిన దానికంటే తక్కువ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. మిస్ శెట్టి కలెక్షన్స్ భారీగా తగ్గడానికి..ముఖ్యంగా హీరోయిన్ అనుష్క ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడం, షారుఖ్ జవాన్ మూవీ రిలీజ్ టైంలో రావడం కలెక్షన్స్ పడిపోవడానికీ కారణం అంటున్నారు సినీ క్రిటిక్స్.