పంజాబ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్దూ కొనసాగుతూ.. తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ కు అల్టిమేటం జారీ చేశారు. పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టాలంటే నూతన అడ్వకేట్ జనరల్ ను నియమించాలని అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన సిద్ధూ.. పీసీసీ అధ్యక్షునిగా కొనసాగుతున్నట్లు తెలిపారు.
అంతేకాదు.. సుమేధ్ సైనీకి బెయిల్ ఇప్పించిన వ్యక్తి ఏజీ ఎలా అవుతాడని, సహోతా లాంటి ఐపీఎస్ అధికారి డీజీపీగా ఎలా ఉంటారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాలను సీఎం దృష్టికి తీసుకొస్తున్నానని చెప్పారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల క్రమంలో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించడంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు సిద్ధూ.