రాష్ట్రంలో నక్సలిజాన్ని నియంత్రించాం : మహమూద్ అలీ

రాష్ట్రంలో నక్సలిజాన్ని నియంత్రించాం : మహమూద్ అలీ

టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో నక్సలిజాన్ని నియంత్రించామన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు మహమూద్ అలీ. ఛత్తీస్ ఘడ్ బార్డర్ లో నక్సల్స్ ప్రభావం ఉందన్న ఆయన.. త్వరలో కంట్రోల్ లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశానికి హోంమంత్రితో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు.