ఈ నెల 12న హైదరాబాద్‌‌కు ద్రౌపది ముర్ము

ఈ నెల 12న హైదరాబాద్‌‌కు ద్రౌపది ముర్ము
  • జులై 12న హైదరాబాద్ కు ద్రౌపది ముర్ము
  • ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ ఏర్పాట్లు
  • భారీ ర్యాలీ నిర్వహించేలా ప్లాన్

హైదరాబాద్, వెలుగు: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈ నెల 12న హైదరాబాద్‌‌కు రానున్నారు. తనకు మద్దతివ్వాలని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కోరనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్‌‌‌‌పోర్టుకు చేరుకోనున్న ముర్ముకు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలుకనున్నారు. అక్కడి నుంచి సమీపంలోని ఓ హోటల్‌‌కు ర్యాలీగా తీసుకెళ్లాలనే ఆలోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. వేదిక ఏదనేది ఇంకా ఖరారు కాలేదు. సుమారు 2 గంటల పాటు హైదరాబాద్‌‌లో ద్రౌపది ముర్ము ఉంటారు. మొదట బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. తర్వాత మేధావులు, గిరిజన, దళిత సంఘాల వారితో ఇంటరాక్ట్ కానున్నారు. యూపీఏ అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్ అట్టహసంగా స్వాగతం పలికి, భారీ ర్యాలీ నిర్వహించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీ కూడా వారికి ఏమాత్రం తీసిపోని రీతిలో ముర్ముకు ఘన స్వాగతం పలికి, భారీ ర్యాలీ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.