ఖేల్‌రత్న, అర్జున అవార్డుల నామినేట్ జాబితా..

ఖేల్‌రత్న, అర్జున అవార్డుల నామినేట్ జాబితా..

భారత అత్యున్నత క్రీడా అవార్డ్ .. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు 11 మంది అథ్లెట్లను జాతీయ క్రీడా అవార్డుల కమిటీ ఇవాళ( బుధవారం) సిఫార్సు చేసింది.  జావెలిన్‌లో టోక్యో ఒలింపిక్స్ 2020లో చారిత్రాత్మక గోల్డ్ మెడల్ సాధించిన  నీరజ్ చోప్రాతో పాటు ఇతర ఒలింపిక్ పతక విజేతలు రవి దహియా, పీఆర్ శ్రీజేష్, లోవ్లినా బోర్గోహైల ఈ లిస్టులో  ఉన్నారు. సునీల్ ఛెత్రీతో పాటు ప్రముఖ భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ కూడా అత్యున్నత గౌరవానికి నామినేట్ అయ్యారు.

టోక్యో ఒలింపిక్స్ 2020తో పాటు టోక్యో పారాలింపిక్స్ 2020లో పలువురు అథ్లెట్లు దేశం గర్వపడేలా చేశారు. పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళగా  పారాలింపియన్ అవనీ లేఖరా కూడా ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైంది. పారాలింపిక్స్ 2020 లో ఎఫ్64 పారా జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకున్న సుమిత్ యాంటిల్ కూడా ఖేల్ రత్నకు సిఫార్సు అయ్యారు. వీరితోపాటు 35 మంది భారత అథ్లెట్లు అర్జున అవార్డుకు  సిఫార్సు చేశారు.

గతంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుగా పిలవగా.. ప్రస్తుతం ఈ అవార్డును ప్రధాని మోడీ లెజెండరీ హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ పేరుతో మార్చారు. ఇటీవల టోక్యో ఒలింపిక్స్ 2020లో హాకీలో భారతదేశం ప్రదర్శన ఆధారంగా భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారంగా మార్చారు.

  • ఖేల్ రత్న అవార్డు సిఫార్స్ అథ్లెట్లు:

నీరజ్ చోప్రా (జావెలిన్‌)
రవి దహియా (రెజ్లింగ్)
పీఆర్ శ్రీజేష్ (హాకీ)
లోవ్లినా బోర్గోహై (బాక్సింగ్)
సునీల్ ఛెత్రి (ఫుట్‌బాల్)
మిథాలీ రాజ్ (క్రికెట్)
ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్)
సుమిత్ ఆంటిల్ (జావెలిన్)
అవని ​​లేఖరా (పారాలింపియన్)
కృష్ణా నగర్ (బ్యాడ్మింటన్)
ఎం. నర్వాల్ (షూటింగ్)

  • అర్జున అవార్డు అవార్డు సిఫార్స్ అథ్లెట్లు


శిఖర్ ధావన్( క్రికెట్)
హర్వింద్ సింగ్(ఆర్చరీ)
భవినా పటేల్( టేబుల్ టెన్నిస్)
సింగ్ రాజ్ అధానా(షూటింగ్)
యోగేష్ కథునియా( డిస్కస్ త్రో)
నిషద్ కుమార్( హైజంప్)
శరద్ కుమార్(హైజంప్)
సుహాన్ ఎల్ వై( బ్యాడ్మింటన్)