సికింద్రాబాద్-పటాన్చెరు రూట్లో కొత్త ఏసీ బస్సులు

సికింద్రాబాద్-పటాన్చెరు రూట్లో కొత్త ఏసీ బస్సులు

గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. సికింద్రాబాద్-పటాన్ చెరు మార్గంలో మొత్తం కొత్త 8 ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సులను అందుబాటులోకి తెచ్చిన్నట్లుగా వెల్లడించారు. ఈ బస్సులు 2023 డిసెంబర్ 15వ తేదీన ప్రారంభం అవుతాయని తెలిపారు.  ఈ రూట్ లో ప్రతి 24 నిమిషాలకో ఏసీ మెట్రో బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని చెప్పారు.  

219 రూట్ నెంబర్ గల ఈ బస్సులు పారడైస్, బోయిన్ పల్లి, బాలానగర్, కూకట్ పల్లి మీదుగా పటాన్ చెరు చేరుకుంటాయి.  తిరిగి అదే మార్గంలో సికింద్రాబాద్ కు వస్తాయి. ఈ మార్గంలో ప్రయాణించే వారందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సజ్జనార్ తెలిపారు.  ఈ బస్సులు సికింద్రాబాద్ నుంచి -పటాన్ చెరుకు ఉదయం   06 : 10 గంటలకు ప్రారంభం అవుతాయి. లాస్ట్ బస్సు రాత్రి 08 : 28 నిమిషాలకు ఉంటుంది.  -పటాన్ చెరులో ఉదయం 07 : 45 గంటలకు ఫస్ట్ బస్సు ఉంటుంది. చివరి బస్సు 10 : 03 గంటలకు ఉంటుంది.