కొత్త ట్విస్ట్.. 139 మంది రేప్ చేయలేదు..ప్రదీప్ కు సంబంధం లేదు

కొత్త ట్విస్ట్.. 139 మంది రేప్ చేయలేదు..ప్రదీప్ కు సంబంధం లేదు

సంచలనం సృష్టించిన 139 మంది రేప్ కేసులో బాధితురాలు భూమి మరో ట్విస్ట్ ఇచ్చింది.139 మంది తనను రేప్ చేయలేదని చెప్పింది. మంద క్రిష్ణ మాదిగ, పీవోడబ్ల్యూ సంధ్యతో కలిసి బాధితురాలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది బాధితురాలు. తనకు సంబంధం లేని వ్యక్తులపై డాలర్ భాయ్ కేసు పెట్టించాడని చెప్పింది. యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడితో పాటు మరికొందరికి ఈ  రేప్ కేసుతో ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. డాలర్ భాయ్ వత్తిడి వల్లే ప్రదీప్, కృష్ణుడిపై కేసు పెట్టానని చెప్పింది. చెప్పినట్లు చేయకపోతే చంపుతానని బెదిరించాడని.. డాలర్ భాయ్ చెప్పినట్లే చేశానని చెప్పింది. తనను కొట్టి సెలబ్రిటీలతో మాట్లాడించేవాడని..తనతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలను కూడా ట్రాప్ చేశాడని చెప్పింది బాధితురాలు భూమి.

139 మంది రేప్ చేశారని తెలిసి తాను చాలా బాధపడ్డానన్నారు ఎమ్మార్పీఎస్ మంద కృష్ణ మాదిగ. తాను బాధితురాలి భూమితో రెండుగంటలు మాట్లాడానన్నారు. బాధితురాలిని 130 మందిలో 30 శాతం మంది దారుణంగా రేప్ చేశారని..ఇంకో  30 శాతం మానసికంగా వేధించారని అన్నారు. మరో 40 శాతం మందికి ఈ కేసుతో సంబంధం లేదన్నారు. ఒక మహిళా ఏసీపీ కేసు విచారిస్తున్నారని..కేసును సీబీడీకి బదిలీ చేయాలన్నారు.

see more news

ప్రశాంత్ భూషణ్ కు ఒక్క రూపాయి ఫైన్..కట్టకపోతే 3 నెలల జైలు శిక్ష

సీబీఐతోనే నిజాలు బయటకొస్తయ్..ప్రధానికి రేవంత్ లేఖ

తెలంగాణలో కొత్తగా 1873 కేసులు..9 మంది మృతి

ఒక్కరోజే 78,512 కేసులు..971 మరణాలు