గ్రేటర్ వ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫుల్ జోష్తో జరిగాయి. ఒమిక్రాన్ భయం ఉన్నప్పటికీ కొత్త సంవత్సరానికి జనం ఉత్సాహంగా వెల్కమ్ చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ట్యాంక్బండ్, నెక్లెస్ రోడ్డులో యూత్ కేకులు కట్చేసి సందడి చేశారు. ‘లవ్ హైదరాబాద్’ వద్ద సెల్ఫీలు దిగుతూ కేరింతలు కొట్టారు. సాయంత్రం నుంచి సిటీలోని రోడ్లన్నీ రద్దీగా మారాయి. హోటల్స్, మాల్స్, బేకరీలు, స్వీట్ షాపులు, షాపింగ్సెంటర్లు జనంతో కిక్కిరిశాయి. వైన్స్లో ఫుల్ రష్ కనిపించింది. హైటెక్ సిటీ, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లోని స్టార్ హోటళ్లలో రాత్రి 9గంటల నుంచి ఈవెంట్స్ షురూ అయ్యాయి. మాల్స్లో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఈవెంట్స్ లో సింగర్స్ తమ పాటలతో హోరెత్తించారు. కరోనా థర్డ్వేవ్ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించడంతో జనం ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈవెంట్లకు వెళ్లలేని వాళ్లు ఇళ్లలోనే గెట్టు గెదర్లు ఏర్పాటు చేసుకున్నారు. అపార్ట్మెంట్లు, కాలనీల అసోసియేషన్లే లోకల్గా స్పెషల్ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాయి. సిటీ శివారుల్లోని రిసార్టుల్లోని ఈవెంట్లు హుషారుగా జరిగాయి. డీజేల మ్యూజిక్ హోరులో యూత్ డ్యాన్సులతో న్యూ ఇయర్కు కిక్ ఇచ్చారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. – హైదరాబాద్, వెలుగు