ఆత్మకూరు: అప్పుడే పుట్టిన ఓ పసి గుడ్డును భూమిలో పాతిపెట్టి చంపాలని చూశారు. దీనిని ఓ లారీ డ్రైవర్ గమనించి, స్థానికులకు సమాచారం ఇవ్వడంతో శిశువు ప్రాణాలు దక్కాయి. హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ శివారులో అప్పుడే ఓ పుట్టిన నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు పాతిపెట్టారు.
కాగా పక్కనే ఉన్న ఓ లారీ డ్రైవర్ భూమిలో శిశువు కదలికలను గమనించి, స్థానికులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకుని మట్టిలో నుంచి పసి గుడ్డును బయటకు తీశారు. ప్రాణంతోనే ఉండటంతో వెంటనే నీళ్లతో శుభ్రం చేసి వరంగల్ ఎంజీఎం తరలించగా డాక్టర్లు సరైన ట్రీట్మెంట్ అందించి ఆ పసిపాప ప్రాణాలు నిలిపారు.