రాష్ట్రంలో మరో 2,426 కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 2,426 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,426 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,52,602 కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం కరోనా బారినపడి 13 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 940కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,324 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,19,467గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,195 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. మరో 25,240 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 338, రంగారెడ్డి 216, మేడ్చల్ 172, నల్గొండ 164, కరీంనగర్ 129, వరంగల్ అర్బన్ 108, ఖమ్మం 98, సంగారెడ్డి 97, నిజామాబాద్ 89, సిద్ధిపేట్ 87, సూర్యపేట్ 78, మహబూబా బాద్ 76, భద్రాద్రి 67, జగిత్యాల 62, మంచిర్యాల్ 57, పెద్దపల్లి 56, కామారెడ్డి 54, నాగర్ కర్నూల్ 50 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

దుబాయ్‌లో మనోడికి 7 కోట్ల జాక్ పాట్‌

రూంమేట్‌కి లొకేషన్ షేర్ చేసి.. సూసైడ్ చేసుకున్న లవర్స్

ఇంట్లో పాత సామాను తీస్తుంటే.. రూ. 95 లక్షల విలువైన మగ్గు దొరికింది