న్యూస్ పేపర్ల డిస్ట్రిబ్యూటర్స్కు గిగ్ చట్టాన్ని అమలు చేయండి..కార్మిక శాఖ స్పెషల్ సెక్రటరీకి నేతల వినతి

న్యూస్ పేపర్ల డిస్ట్రిబ్యూటర్స్కు గిగ్ చట్టాన్ని అమలు చేయండి..కార్మిక శాఖ స్పెషల్ సెక్రటరీకి నేతల వినతి

హైదరాబాద్, వెలుగు: న్యూస్ పేపర్ల డిస్ర్టిబ్యూటర్స్​కు గిగ్ వర్కర్ల చట్టాన్ని అమలు చేయాలని కార్మిక శాఖ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందనను  డిస్ర్టిబ్యూటర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ వనమాల సత్యం, యామిని మధుసూదన్ కోరారు.

శనివారం సెక్రటేరియెట్​లో  హరిచందనను కలిసి వినతిపత్రం అందచేశారు.  రాష్ట్రంలో న్యూస్ పేపర్ల  పంపిణీ దారులైన ఏజెంట్లు వెండర్లు , పేపర్ బాయ్స్ అందరికీ గిగ్ వర్కర్స్​కు  అమలు చేసే సంక్షేమ స్కీమ్​లను అమలు చేయాలని కోరారు. ఈ  అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని స్పెషల్ సెక్రటరీ హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో  రవి, లింగమూర్తి పాల్గొన్నారు.