ఫైనల్లో శివ, పూజ, ఆశిష్
టోక్యో: ఒలింపిక్స్ బాక్సింగ్ టెస్ట్ ఈవెంట్లో ఇండియా బాక్సర్ల పంచ్ అదిరింది. ముగ్గురు బాక్సర్లు ఫైనల్లోకి ప్రవేశించగా, తెలంగాణ స్టార్ నిఖత్ జరీన్, సిమ్రాన్జిత్ కౌర్, వాహ్లింపుయా, సుమిత్ సాంగ్వాన్ కాంస్యాలతో మెరిశారు. మహిళల 51 కేజీల సెమీస్ బౌట్లో నిఖత్ జరీన్ .. సనా కవానో (జపాన్) చేతిలో, సిమ్రాన్జిత్ (60 కేజీ).. రిమ్మా వులోసెంకో (కజకిస్థాన్) చేతిలో ఓడారు. ఇక పురుషుల 91 కేజీల సెమీస్ బౌట్లో సుమిత్.. అబెక్ ఒర్లాబే (కజకిస్థాన్)చేతిలో, వాహ్లింపుయా (75 కేజీ).. యుటో మోరివాకి (జపాన్) చేతిలో ఓడి బ్రాంజ్లతో సంతృప్తిపడ్డారు. పురుషుల 63 కేజీల సెమీస్ బౌట్లో శివ థాపా… డైసుక్ నరిమట్స్ (జపాన్)పై గెలిచాడు. మహిళల 75 కేజీల బౌట్లో పూజా రాణి.. బెట్రిజ్ సోరెస్ (బ్రెజిల్)పై గెలిచి టైటిల్ పోరుకు క్వాలిఫై అయ్యింది. 69 కేజీల సెమీస్ పోరులో ఆశిష్.. హీరోకి కింజాయో (జపాన్)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించాడు.