సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా ‘స్పై’

సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా ‘స్పై’

నిఖిల్ సిద్ధార్థ్ రా ఏజెంట్‌‌గా నటించిన చిత్రం ‘స్పై’. ఎడిటర్  గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని కె.రాజశేఖర్ రెడ్డి నిర్మించారు.  సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్  29న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వాటిని కొట్టిపారేస్తూ మేకర్స్  మరోసారి రిలీజ్‌‌ డేట్‌‌ను కన్ఫర్మ్ చేశారు. సినిమా అవుట్‌‌పుట్‌‌పై ఎంతో నమ్మకంగా ఉన్నామని, ఇది కచ్చితంగా ఇండియన్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌‌‌‌లో చరిత్ర సృష్టిస్తుందన్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా విడుదల  కానుంది. ఆల్రెడీ విడుదలైన టీజర్ క్యూరియాసిటీని పెంచింది. ఐశ్వర్య మీనన్, సన్యా ఠాకూర్ హీరోయిన్స్‌‌. ఆర్యన్ రాజేష్​ ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అభినవ్ గోమటం, మకరంద్ దేశ్‌‌పాండే, జిషు సేన్ గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ కలిసి సంగీతం అందించారు.