
నిపా.. కేరళను వణికిస్తున్న డేంజర్ వైరస్ ఇది. ప్రస్తుతం దీని చికిత్సకు మందులేదు. ఈ వైరస్బారిన పడితే పడితే బతికి బట్టకట్టడం కష్టమే. గతేడాది కేరళలోనే ఏకంగా 17 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. జంతువుల నుంచి మనుషులకు సోకే ఈ వైరస్.. ఒకరి నుంచి మరొకరికి కూడా వ్యాపిస్తుంది. తాజాగా కేరళలో నిపా వైరస్ఉనికి బయటపడడంతో కేంద్రం అలర్ట్అయ్యింది. వైరస్వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆరుగురు సభ్యుల ఎక్స్పర్ట్టీమ్ను రాష్ట్రానికి పంపించింది. ఈ వైరస్బాధితులను గుర్తించేందుకు కంట్రోల్రూం ఏర్పాటు చేసింది. అనుమానితులను ప్రత్యేకంగా పరీక్షించేందుకు ఏర్పాట్లు చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజకు ఫోన్ చేసి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వైరస్వ్యాప్తి విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం గతేడాది ఈ వైరస్తో 17 మంది చనిపోయారు. తాజాగా 23 ఏళ్ల ఓ కాలేజ్స్టూడెంట్కు నిపా వైరస్సోకిందని డాక్టర్లు నిర్ధారించారు. మరో 311 మంది అనుమానితులను విడిగా ఉంచి పరీక్షిస్తున్నట్లు మంత్రి శైలజ చెప్పారు. వైరస్సోకిన స్టూడెంట్కు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. పూణెకు చెందిన నేషనల్ఇనిస్టిట్యూట్ఆఫ్వైరాలజీకి చెందిన నిపుణుల బృందం స్టూడెంట్ను పరీక్షిస్తోందన్నారు.
ఏమిటీ నిపా వైరస్?..
గబ్బిలాల నుంచి కుక్క, పంది, గుర్రం వంటి జంతువులకు సోకే ప్రమాదకరమైన వైరస్ఇది. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. అరుదుగా కలుషిత ఆహారంతో, ఒకరి నుంచి ఇంకొకరికి కూడా వైరస్వ్యాపించవచ్చు. వైరస్సోకితే తీవ్రమైన అనారోగ్యం వచ్చి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.1998–99లో మలేషియాలోని సుంగై నిపా అనే ఊళ్లో ఈ వైరస్ను మొదట గుర్తించడంతో దీనికా పేరు వచ్చింది.
వైరస్ లక్షణాలు…
బ్రెయిన్ఫీవర్, జ్వరంతో పాటు దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. శ్వాసకోశ వ్యాధులు, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, గొంతు నొప్పి, కళ్లు తిరగడం, నిద్ర మత్తు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.కొన్ని కేసుల్లో వైరస్బాధితులు న్యుమోనియాతో ఇబ్బంది పడడం గుర్తించినట్లు వరల్డ్హెల్త్ఆర్గనైజేషన్వెల్లడించింది.
ఈ వైరస్కు చికిత్స ఉందా?…
నిపా వైరస్చికిత్సకంటూ ప్రత్యేకంగా ఎలాంటి మందులుకానీ, వైరస్సోకకుండా ఎలాంటి వ్యాక్సిన్కానీ లేవని వరల్డ్హెల్త్ఆర్గనైజేషన్ప్రకటించింది. వ్యాధి తీవ్రత దృష్టిలో పెట్టుకొని చికిత్సకు మందును కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లేబరేటరీలో జరిపిన పరీక్షల్లో రిబావిరిన్అనే మందు దీనిపై ప్రభావం చూపిస్తుందని తేలినా.. మనుషులపై ప్రయోగాత్మకంగా ఇప్పటి వరకూ పరీక్షించి చూడలేదని సైంటిస్టులు చెబుతున్నారు.
ఇండియాలో..
మన దేశంలో 2001లో సిలిగురిలో ఈ వైరస్తొలి సారిగా బయటపడింది. 66 మంది వైరస్బారిన పడితే అందులో 45 మంది చనిపోయారు. మలేషియా, సింగపూర్, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళలో వైరస్వ్యాపిస్తోంది. మిగతా ప్రాంతాల్లోనూ వైరస్విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాంబోడియా, చైనా, ఇండోనేషియా, మడగాస్కర్, తైవాన్, థాయ్లాండ్దేశాలకూ వైరస్ముప్పు ఉందని వార్నింగ్ఇచ్చారు.
వైరస్ బారిన పడకుండా ఉండాలంటే..?
వైరస్బాధితులను తాకితే చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ఖర్జూరం, ఈత పళ్లను నేరుగా తీసుకోవద్దు. మిగతా పండ్లను కూడా శుభ్రంగా కడిగాకే తినాలి. ఈత కల్లుకు దూరంగా ఉండాలి.