కేరళలో నిఫా వైరస్ కలకలం.. 12 ఏళ్ల బాలుడు మృతి

కేరళలో నిఫా వైరస్ కలకలం.. 12 ఏళ్ల బాలుడు మృతి

కేరళ: ఒకపక్క కరోనా కేసులు పెరగడంతో సతమతమవుతున్న కేరళను ఇప్పుడు నిఫా వైరస్ వణికిస్తోంది. తాజాగా కేరళలో నిఫా వైరస్ బారిన పడి 12 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. దాంతో రాష్ట్రంలో అటు కరోనా.. ఇటు నిఫా వైరస్ ప్రభావంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బాలుడి మృతితో రాష్ట్రంలో నిఫా వైరస్ వ్యాప్తి జరుగుతుందని కేరళ వైద్యశాఖ ప్రకటించింది. రెండేళ్ల కిందట కూడా నిఫా వైరస్ వల్ల కేరళలో వందల సంఖ్యలో మరణాలు సంభవించాయి.