భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చైనా చేస్తున్న కుట్రలపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనదేశంలో చైనాకు చెందిన ఉత్పత్తులను నిలిపివేయాలని, స్మార్ట్ ఫోన్ల నుంచి ఆ దేశానికి చెందిన యాప్ లను తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
బిజినెస్ టుడే కథనం ప్రకారం..
తాజాగా భారత్ – చైనా దేశాలపై మధ్య నెలకున్న ఉద్రిక్తత పరిస్థితులపై మాజీ డీఆర్ డీఓ డైరెక్టర్, నీతి ఆయోగ్ సభ్యుడు వీగే సరస్వత్ స్పందించారు. చైనాకు బుద్ధి చెప్పేలా ఆ దేశం నుంచి మనదేశానికి దిగుమతి చేస్తున్న ఉత్పత్తులను నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు. అంతేకాదు సైన్యం కోసం చైనా నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కొనుగోలు చేయడం ఆపేయాలన్నారు. సాధారణ పరిస్థితుల్లో అంటే రెండు దేశాల మధ్య సంబందాలు బలంగా ఉన్న సమయంలో భారత సైన్యం కోసం కేంద్రం రెండు లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కోసం చైనా కు ఆర్డర్ ఇచ్చింది. మరికొన్ని రోజుల్లోనే 1.86 లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు భారత్కు రానున్నాయి. ఈ సమయంలో ఆ కాంట్రాక్టు రద్దు చేసుకోవాలని నీతి అయోగ్ సభ్యుడు కోరారు. చైనా నుంచే దిగుమతయ్యే వస్తువులే కాదు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు సైతం నాసిరకంగా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
బుల్లెట్ ఫ్రూప్ జాకెట్ల తయారీకోసం నీతి ఆయోగ్ ను రోడ్ మ్యాప్ కోరిన కేంద్రం
సైనికుల కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో పాటు, రక్షణగా ఉంచే కిట్ల తయారీ కోసం రోడ్ మ్యాప్ను సిద్ధం చేయాలని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) నీతి ఆయోగ్ను కోరింది. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు సరస్వత్ ఈ వ్యాఖ్యలు చేశారు. సాధ్యమైనంత వరకు కేంద్రానికి తమ కమిటీ చాలా స్పష్టమైన సిఫార్సులు చేసిందన్నారు. ఎక్కువ శాతం సొంత ఉత్పత్తుల్ని వినియోగించుకోవాలని, అవసరమైన విదేశాలనుంచి కొనుగోలు చేయోచ్చన్నారు. కానీ చైనాతో బుల్లెట్ ఫ్రూఫ్ ల విషయం కుదుర్చుకున్న ఒప్పొందాలను రద్దు చేసుకోవాలని తెలిపారు.