నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

నిజామాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం ఆరు టేబుల్లపై ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తం రెండే రౌండ్లు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే 25 ఓట్ల చొప్పున కట్టలు కట్టారు. టేబుల్ ల వారీగా 4 కట్టలు డివైడ్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడతారు. మొత్తం 823 ఓట్లు ఉండగా అందులో 2 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. మొదటి రౌండ్ లో 600 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటి రౌండ్ లోనే ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది.